WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి భక్తుడు సూర్యవంశం పరుశరాముడు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.10,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి గురురాజాచార్యులు, కమిటీ సభ్యుడు గౌనీ బుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.