KMM: డిమాండ్ల సాధనకై సత్తుపల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెకు దిగారు. 2021, 2025 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నినదించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.