SRD: ఆందోల్ కేజీబీవీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశపరీక్ష కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జీసీడీవో సునీత శుక్రవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న బాలికలు www.tgrjc.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.