NRML: సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీని మండల ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కలకు క్రమం తప్పకుండా ప్రతిరోజు నీరును అందిస్తూ ఉండాలని తెలిపారు. మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరిపే రవళి విలాస్, సెక్రటరీ నరేష్, ఉప సర్పంచ్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.