NRML: 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా విజ్ఞాపన ధర్నాకు శనివారం నిర్మల్ నుంచి ఉపాధ్యాయులు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4, 57/5 మెమోలను అమలు చేసి తమకు పాత పెన్షన్ కల్పించాలని వారు కోరారు.