NZB: TU లోని ప్రధాన ప్రాంగణంలో SC, ST సెల్ ఆధ్వర్యంలో నేడు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వాణి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు రేపు ఉదయం 11గం.లకు ప్రాంగణంలోని హనుమాన్ ఆలయం వద్దకు చేరుకోవాలని ఆమె సూచించారు.