BDK: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని సీపీఎం పార్టీ పిలుపులో భాగంగా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.