SRCL: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెన్నమనేని వికాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడైన వికాస్ రావు గత ఎన్నికలలో వేములవాడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, వేములవాడ ఇన్ఛార్జ్గా ఉన్నారు.