KNR: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్లో ఆదివారం 2కే రన్ నిర్వహించారు. కళాభారతి నుంచి డా. బీఆర్. అంబేద్కర్ స్టేడియం వరకు జరిగిన ఈ రన్లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.