MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు యాప్ ల విషయంలో అవగాహన పెంచుకోవాలని జన్నారం మండలంలోని వ్యవసాయ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతుల మేలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మార్ రిజిస్ట్రీ, యూరియా బుకింగ్ యాప్ లను అమల్లోకి తీసుకువచ్చాయన్నారు. ఆ యాప్లలో రైతులకు మేలు చేసే అంశాలు ఉన్నాయని, వాటి ద్వారా సేవలు పొందవచ్చన్నారు.