KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గామాత ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, అమ్మ దయా కరుణా కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి ప్రార్థించారు.