GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం కేటీదొడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 2 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ సాయం పొందాలని కోరారు. లబ్ధిదారురాలు నరసమ్మకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.