BDK: మణుగూరు మున్సిపాలిటీ పల్లె దవాఖాన వరకు సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడనున్న సైడ్ డ్రైన్ పనులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తామన్నారు.