WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠాలతో పాటు మత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు మత ప్రచారం నిర్వహించడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని DEO స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.