MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయాన్నే వేద పండితులు దేవాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి వేద పండితులు, అధికారులు తాళం వేసి మూసి వేశారు. బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో సంప్రోక్షణ పూజలు చేసి భక్తులను అనుమతించనున్నారు.