BDK: అశ్వాపురం మండలానికి చెందిన రైతు చిగురుపాటి భద్రయ్య వరి పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన స్టేట్ రైతురత్న అవార్డు అందుకోవడం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. బుధవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రయ్యని ఎమ్మెల్యే పాయం ఘనంగా సన్మానించి శాలువా కప్పి సత్కరించారు.