ELR: కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం Y జంక్షన్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు శనివారం నిరసన చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలుపుతున్న టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని ప్రత్యేక పూజలు చేశారు.