KNR: ఇల్లందకుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక సంస్థల సందర్శనలో భాగంగా జమ్మికుంటలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. కాటన్ మిల్లులో ఉత్పత్తి విధానాలు, KVKలో సేంద్రియ ఎరువుల తయారీ, పంటల వైవిధ్యం గురించి తెలుసుకున్నారు.