MHBD: సిరోల్ మండలం కంది కొండ గ్రామ శివారులో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. శనివారం పంటచేలల్లో గుర్తించిన పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.