KNR: గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పులు శ్రీధర్ MGNREGS పని ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామంలోని పాత చెరువు చేపల కుంట పని 65 మంది కూలీలతో జరుగుతుండగా వారితో ఆయన మాట్లాడారు. కొత్తగా అమలులోకి వచ్చిన ఈకేవైసీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు స్థితిని పరిశీలించారు.