GDWL: కృష్ణానది తీరాన చారిత్రక ప్రాభవంతో విరాజిల్లుతున్న ప్రాగుటూరు రాతి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నడిగడ్డ ప్రజలు కోరుతున్నారు. సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోటలో రాజ దర్బారు, ఆలయాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శిథిలావస్థకు చేరుతున్న ఈ కట్టడాలకు పురావస్తు శాఖ మరమ్మతులు చేపట్టి, వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.