KMM: టీబీ రహిత జిల్లాగా ఖమ్మంను తయారు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పాల్గొన్నారు.