సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు కర్రీ, ఆలుగడ్డ, టమాట కర్రీలను పరిశీలించారు. బిర్యానీ అన్నం నాణ్యత సరిగా లేదని బిర్యానీలో బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.