MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని స్థానిక ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితిని అధికారులు, పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు.