GDWL: గుండెపోటుతో ఇంటి యజమానిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబానికి ఈ ఐదు లక్షల ఆర్థిక సాయం భవిష్యత్తుపై భరోసానిస్తుంది అని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ అన్నారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామానికి శారదమ్మకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ సొమ్మును వృథా చేయకుండా పిల్లల చదువులకు వాడాలన్నారు.