JN: రఘునాథపల్లి మండలంలోని వీరారెడ్డితండాలో దుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ చంద్ర రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ ఆశీస్సులతో రఘునాథపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.