PDPL: ఓదెల మండల కేంద్రానికి బాల వికాస్ సంస్థ రెండు వాటర్ ప్లాంట్లను మంజూరు చేసింది. సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ విజ్ఞప్తి మేరకు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అవసరమైన గదులు, నీటి వసతి కల్పిస్తే త్వరలోనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుద్ధ జలాల లభ్యతపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.