MNCL: మంచిర్యాల జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆధార్ కార్డు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.