HYDలో లబ్బ మిర్చికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో లబ్బ మిర్చి రూ.100కు విక్రయిస్తున్నారు. సాధారణంగా పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ మిర్చి ధర ఉప్పల్, ఎల్బీనగర్, అత్తాపూర్, అల్వాల్ ప్రాంతాల్లో దాదాపుగా ఇదే ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే ఎండాకాలంలో పచ్చళ్ల సీజన్ కానుండగా, ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.