NRML: కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డీఇవో భోజన్న ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ఫోర్స్ భైంసా విద్యార్థి కులకర్ణి అర్ణవ్ స్మార్ట్ వీల్ చైర్ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. మరో ఇద్దరు విద్యార్థుల ప్రదర్శనలు సౌత్ ఇండియా స్థాయికి ఎంపికయ్యారన్నారు. జాతీయ స్థాయికి ముగ్గురు ఎంపిక కావడం జిల్లాకు ఇదే తొలిసారి.