GDWL: అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను ముంబైకి చెందిన సుధారాణి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం కోసం రూ.55,555 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సత్రం ఛైర్మన్ రమేశ్ గుప్త దాతలను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.