MNCL: రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నుంచి విఠల్ నగర్ వెళ్లే దారిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్, బైక్ని ఢీ కొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మందమర్రి పట్టణం 2వ జోన్ కు చెందిన చంటి మల్లీశ్వరిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.