BHNG: మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మట్టిపల్లి మల్లమ్మ ఇటీవల మరణించగా, మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.