SDPT: కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. బీజెపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ సాదుల అమూల్యకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల గ్రాంట్ అందజేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు వినియోగిస్తామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థులకు సైకిళ్లు, బోర్లు వంటి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.