BHPL: చిట్యాల(M) బౌసింగ్ పల్లికి చెందిన అక్క-తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపారు. దెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య TG నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలిచింది. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా వ్యాప్తంగా వీరి విజయాన్ని ప్రశంసిస్తున్నారు.