SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలపై బుధవారం తేనె టీగలు దాడి చేశాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు చేస్తున్న 10 మంది కూలీలపై దాడి చేశాయి. బాధితులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పులి పాలవ్వ అనే మహిళకు తీవ్రగాయాలు అయినట్లు తెలిపారు.