NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులోని ఇటుకబట్టీలో పనిచేస్తున్న వలస కూలీ రంజిత్ వైద్యనాథ్ (20) అనుమానాస్పదంగా మృతిచెందాడు. మహారాష్ట్రకు చెందిన అతడు కుటుంబ గొడవలతో మద్యం తాగి అర్ధరాత్రి ఉరేసుకున్నట్లు సమాచారం. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.