BDK: ఆళ్లపల్లి రైతు వేదిక ప్రాంగణంలో మార్చి 8న(ఆదివారం) ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పీహెచ్సీ వైద్యులు అర్వపల్లి రేవంత్ తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఎముక, దంత తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.