MLG: మంగపేట మండల కేంద్రంలో శనివారం TSUTF ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు హాజరై, మాట్లాడారు. ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన పేర్కొన్నారు. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసే ముందు ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్నారు.