NGKL: వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు సింధు, రమణకుమార్, కవిత విద్యార్థులకు రక్తహీనత, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.