KNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక బడిన కులాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో తాటి చెట్టుపై నుంచి కింద పడి అంగవైకల్యం పొందిన గీత కార్మికుడు సంజీవ్ గౌడ్కు ఎక్సైజ్ శాఖ నుంచి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా అందించినట్లు వారు తెలిపారు.