KNR: ఇటీవల ములుగు జిల్లా మేడారంలోని ఆడిటోరియం హాల్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలో హుజురాబాద్ చెందిన మండ సాన్విత గోల్డ్ మెడల్ సాధించినట్లు స్థానిక బీబీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ భూసారపు బాబురావు, రాజ్ కుమార్ తెలిపారు. కుమతి కట్టా విభాగంలో ఏడుగురు విద్యార్థులు సైతం గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు.