ప్రకాశం: గిద్దలూరు (మం) తంబళ్లపల్లె గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.