BPT: మాదక ద్రవ్యాల రహిత ఏపీ కోసం విజయ్ కలాం చేపట్టిన 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర బాపట్లలో బుధవారం ముగిసింది. ఇక్కడి మున్సిపల్ హైస్కూల్లో 250 మంది విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. యువత మత్తుకు బానిస కావొద్దని సూచించారు.