CTR: తవణంపల్లి మండలంలో “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలని పిలుపునిచ్చారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్, డ్రాప్ అవుట్ పిల్లలపై సమీక్ష నిర్వహించి, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.