NGKL: కుమ్మెర గ్రామాన్ని నేడు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించనున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురానున్నారు.