WGL: BRS పార్టీ కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటానని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామానికి చెందిన మంద ఉపేంద్ర ఇటీవల మరణించగా ఇవాళ వారి కుటుంబ సభ్యులను మాజీమంత్రి ఎర్రబెల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.