SRD: మున్సిపాలిటీలో ఆస్తి, వాణిజ్య, కుళాయి పన్నులు మార్చి 31లోపు పూర్తిగా చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ ద్వారా కూడా పన్నులు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.