HNK: తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ హాస్య నటులు చిత్రం శ్రీను, రఘులు నేడు నగరంలో సందడి చేశారు. ఈ క్రమంలో వేయిస్తంభాల దేవాలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్బంగా రుద్రేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి, ఆశీర్వచనాలు ఇచ్చారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.