NLG: HYD వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హాలియా మండలం అల్వాల వాసి శివ (20), మిర్యాలగూడ వాసి సందీప్(20) మృతి చెందారు. మంగళవారం రాత్రి వీరు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.